Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పంద విలువ రూ.4,447 కోట్లు
న్యూఢిల్లీ : నిత్యావసరల ఇ-కామర్స్ వేదిక బ్లింకిట్ను ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ కొనుగోలు చేయనుంది. ఇది వరకు గ్రోఫ ర్స్ ఇండియాగా ఉన్న బ్లింకిట్ ను రూ.4,447.5 కోట్లు చెల్లించి స్వాధీనం చేసుకోవడానికి ఒప్పందం కుదర్చుకుంది. శుక్రవారం జరిగిన జొమాటో బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. బ్లింకిట్ కామర్స్కు చెందిన 33,018 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి.. ఒక్కో షేరుకి రూ. 13.45 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు జొమాటో తెలిపింది. కాగా.. జొమాటోకు చెందిన 62.85 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించడం ద్వారా లావాదేవీని పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. రూ.1 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 70.76 సగటు ధరలో జారీ చేయను న్నట్లు తెలిపింది. బ్లింకిట్ కొనుగోలు తదుపరి రెండు కంపెనీల యాప్స్ విడిగా కొనసాగనున్నట్లు జొమాటో వెల్లడించింది.