Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన బంగారం మదుపు పథకానికి స్పందన అంతగా కనిపించ లేదు. ఇప్పటి వరకు ఈ పథకంలో 400 గ్రాముల వరకే డిపాజిట్ చేశారని భారతీయ రత్నాలు, నగల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఉత్తర ప్రాంత చైర్మన్ అనిల్ శంఖ్వాల్ విలేఖరులతో అన్నారు. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. దేశంలో మొత్తం 20,000 టన్నుల బంగారం ఉందని అంచనా. బంగారు పథకంలో ఇళ్లల్లోను, గుళ్లల్లోను ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేయమని, దానికి సరైన వడ్డీ రేట్లను చెల్లిస్తామని ప్రధాని దేశ ప్రజలను అభ్యర్థించారు. అలాగే ప్రభుత్వం బంగారు మద్దతు గల బాండ్ల 'పేపర్' గోల్డ్ను ప్రారంభించింది. బంగారాన్ని డిపాజిట్ చేయడానికి దేశంలో తగినన్ని కేంద్రాలు లేకపోవడం సమస్యగా పరిణమించిందని అనిల్ శంఖ్వాల్ అన్నారు. ఈ పథకాన్ని సమీక్షించడానికి ,బంగారాన్ని పరీక్షించి, బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించిందని ఆయన అన్నారు.