Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జిఎంఆర్ ఎనర్జీకి చెందిన జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 2×384 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ఆర్ఎల్ఎన్జి స్కీమ్లో గ్యాస్ అధారితంగా దీన్ని అందుబాటులోకి తెచ్చామని ఆ కంపెనీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా విద్యుత్ కంపెనీలకు పవర్ సెక్టార్ డెవలప్మెంట్ ఫండ్లో ప్రతి యూనిట్పై రూ.1.44 సబ్సీడీ లభించనుంది. ఆర్ఎల్ఎన్జి పథకంలో భాగంగా తొలుత 768 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లో 50 శాతం సామర్థ్యాన్ని అంటే 384 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి, సరఫరా చేయనుంది. ప్రస్తుత నిర్వహణ ఉత్పత్తి మార్చి 2016 నాటికి కొనసాగనుందని తెలుస్తోంది.