Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు అహారాన్ని సరఫరా చేసేందుకు గాను ఆన్లైన్ టికెట్ సిస్టమ్ ఐఆర్సిటిసితో ఫుడ్ స్టార్టప్ సంస్థ హలో కర్రీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణికులు ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా హోల్సమ్ హెల్త్ అప్షన్తో ఆర్డర్ చేసిన ఆహారాన్ని వెంటనే అందించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. హలో కర్రీ మెనూ సికింద్రాబాద్ స్టేషన్లోని వివిధ ప్యాసింజర్ బోర్డింగ్ రైళ్ల దగ్గర అందుబాటులో ఉంటుందని హలో కర్రీ వ్యవస్థాపకులు రాజు భూపతి తెలిపారు. ఆహారాన్ని ఆర్డర్ చేసిన 30 నిమిషాల వ్యవధిలో వినియోగదారులకు డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఢల్లీీ, వైజాగ్, పూణె. బెంగుళూర్ నగరాలల్లో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నామన్నారు.