Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో యువకులు మొబైల్ ఫోన్లలో సగటున రోజుకు రెండు గంటల చొప్పున ఇంటర్నెట్పై గడుపుతున్నారని ఆ సర్వేలో వెల్లడయ్యింది. అంతర్జాతీయ పరిశోధన కన్సల్టెన్సీ సంస్థ టిఎస్ఎస్ సర్వే ప్రకారం భారత్లో 16-30 ఏళ్ల వయసు వారు సగటను రోజుకు 2.20 నిమిషాలు మొబైల్ నెట్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది అంతర్జాతీయ సగటు రోజుకు 3.2 గంటలతో పోల్చితే తక్కువగానే ఉందని పేర్కొంది. భారత్లో 31-45 వయస్సు వారు రోజుకు సగటున 1.8 గంటల పాటు, 46-65 ఏళ్ల వయస్కులు సగటున 1.5 గంటల పాటు నెట్పై ఉంటున్నారని ఆ సంస్థ పేర్కొంది.