Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ రెండంకెల వృద్ధి
న్యూఢిల్లీ : విమానయాన కంపెనీలు అక్టోబర్లో ప్రయాణికుల రద్దీతో పండుగ చేసుకున్నాయి. క్రితం మాసంలో దేశీయంగా విమానయాన ప్రయాణికులు 19 శాతం పెరిగారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించింది. ఈ మాసంలో మొత్తంగా 70.39 లక్షల మంది విమానయాన ప్రయాణికులు నమోదయ్యారు. 2014 ఇదే మాసంలో 59.25 లక్షల మంది విమానయానాన్ని ఉపయోగించుకున్నారు. క్రితం మాసంలో ఇండిగో అత్యధికంగా 36.8 శాతం మార్కెట్ వాటాతో ముందు వరుసలో ఉంది. స్సైస్జెట్ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా 12.8 శాతం వాటాను నమోదు చేసుకుంది. ఎయిర్ ఇండియా 10.88 లక్షల ప్రయాణికులతో 15.5 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. జెట్ ఎయిర్వేస్ 14.19 లక్షల ప్రయాణికులతో 18.80 శాతం వాటాను స్వాధీనం చేసుకుంది. గో ఎయిర్ 14.95 లక్షల ప్రయాణికులతో 18.80 శాతం మార్కెట్ వాటాను నిలుపుకుంది.