Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షేరు ఒక్కింటికి రూ.1 డివిడెండ్
ముంబయి: అల్యూమినియం తయారీ దిగ్గజ సంస్థ హిందాల్కో మార్చితో ముగిసిన త్రైమాసికానికి తమ స్వతంత్య్ర నికర లాభం 36 శాతం మేర క్షీణించి రూ.160 కోట్లుగా నమోదు అయినట్లు వెల్లడించింది. సంస్థ రెన్యూవబుల్ పవర్ అబ్లిగేషన్ (ఆర్పీఓ) బకాయి రూ.146 కోట్లుగా నిర్ణయించిన కారణంగా లాభాల్లో క్షీణత నమోదు అయినట్లు సంస్థ తెలిపింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరంలోని మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.248 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సంస్థ స్వతంత్య్ర నికర అమ్మకాలు 10 శాతం మేర పెరిగి రూ.9,219 కోట్లుకు చేరాయి. అంతకు ముందు ఇదే కాలంలో అమ్మకాలు రూ.8,360 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో సంస్థ వ్యయాలు కూడా రూ.7,835 కోట్ల నుంచి రూ.8,761 కోట్లకు పెరిగాయి. పన్ను చెల్లింపు తరువా సంస్థ నికర లాభం రూ.160 కోట్ల తక్కువ స్థాయిలో నమోదు అవడానికి అసాధారణమై ఆర్పీఓ కేటాయింపే కారణమని సంస్థ తెలిపింది.
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ మొత్తం నికర లాభం 35 శాతం మేర కుంగి రూ.925 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు ఈ లాభం రూ.1413 కోట్లుగా ఉంది. సంస్థ బోర్డు ఒక్కో షేరునకు రూ.1 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని సిఫారసు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. నిరాశగొలిపే ఫలితాల కారణంగా సంస్థ షేరు గురువారం 1.57 శాతం మేర క్షీణించింది.