Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సంస్థ ఎడ్యూటైన్మెంట్ ట్యాబ్ విభాగంలోకి అడుగుపెటింది. చిన్నారుల కోసం వినోదంతో కూడిన విద్యను అందించేందుకు గాను సంస్థ 'కాన్వాస్ ట్యాబీ'ను ఆవిష్కరించింది. ిల్లలు ఆనందంగా నేర్చుకోనేందుకు వీలుగా సంస్థ దీనిని తయారు చేసింది. పిన్నలు, పెద్దలు వాడుకొనేందుకు వీలుగా సంస్థ దీనిలో ఏర్పాట్లు చేసింది. చిన్నారులు కొంత సమయం వాడిన తరువాత డివైస్ దానంతట అదే స్విచ్ ఆఫ్ అయ్యేందుకు, ఎక్కువగా ఇంటర్నెట్ వాడకుండా నియంత్రించేందుకు ఇందులో పలు ఏర్పాట్లు ఉన్నాయి.
దీని ధరను సంస్థ రూ.6,499గా నిర్ణయించింది. ముందస్తుగా ఇది కేవలం ఫ్లిప్కార్టులోనే అందుబాటులో ఉంటుంది ఆ తరువాత మూడు వారాలకు మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. పిల్లలు నేర్చుకొనేలా ఇందులో ప్రీలోడెడ్ ప్రోగ్రాములు కూడా ఉన్నాయి. యండ్రాయిడ్ కిట్కాట్ వోఎస్తో నడిచే ఈ ట్యాబీ 1.3 గీగాహెడ్జ్ ప్రాసెసర్తో లభిస్తుంది. ఏడు అంగుళాల తెర, 1జీబీ ర్యామ్, 8జీబీ రామ్, 3,200 మహా బ్యాటరీ దీని మరిన్ని ప్రత్యేకతలు.