Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఎల్జీ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'ఎల్జీ జీ4' స్మార్ట్ఫోన్లను బాలీవుడ్ సూపర ్స్టార్ అమితాబచ్చన్ శుక్రవారం ముంబయిలో ఆవిష్కరించారు. సంస్థ మొట్టమొదటి సారిగా లెదర్, డీఎస్ఎల్ఆర్ల మేళవింపులతో ఈ అధునాతన ఫోన్ను రూపొందించింది. దీనికి వెనక 16 ఎం.పి. కెమెరా, ముందు 8 ఎం.పి. కెమెరా సౌకర్యంతో సంస్థ విడుదల చేసింది. కొత్త స్మార్ట్ ఫోన్లో ఎల్జీ 'కలర్ స్పెక్ట్రమ్ సెన్సార్'ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్ల విభాగంలోనే మొట్టమొదటి సారిగా ఒక కంపెనీ ఈ సౌకర్యాన్ని అందించడం ఇదే తొలిసారి. మరింత మెరుగైన డిస్ప్లే కోసం 5.5 అంగుళాల ఐపీఎస్ క్వాంటమ్ డిస్ల్పేను ఏర్పాటు చేశారు. జీ4 ఫోను నలుపు, ఎరుపు, గోధుమ రంగులలో అందుబాటులో ఉంచారు. ఎల్జీ కంపెనీ. చూడగానే ఆకర్షించేలా సుందరమైన రూపంతో దీనిని సంస్థ తయారు చేసింది. ఈ కొత్త ఫోను 3000 ఎంఏహచ్ రిమూవబుల్ బ్యాటరీతో లభిస్తుంది. దీని ధరను ఎల్జీ సంస్థ రూ.51,000గా నిర్ణయించింది. ఆగస్టు 15లోపు ఈ ఫోన్ను విక్రయించిన వారిలో అదృష్టవంతులకు అమితాబ్ను వ్యక్తిగతంగా కలుసుకొనే వీలుతో కూడిన పథకాన్ని ఎల్జీ సంస్థ ఈ ఫోన్కు ప్రకటించింది.