Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. బులియన్ మార్కెట్ అమ్మకాల్లో స్తబ్దత నెలకొనడంతో ముంబయిలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.40 తగ్గి రూ.26,785గా, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.26,935గా పలికింది. 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండిపై రూ.25 తగ్గి రూ.37,375గా నమోదయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర యథాతథంగా 1,200 డాటర్లుగా చోటు చేసుకుంది.