Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- ఆర్ఐఎన్ఎల్ సిఎండి వెల్లడి
హైదరాబాద్: రానున్న పదేళ్లలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) వైజాగ్ స్టీల్పై రూ.35,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందించిందని ఆర్ఐఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి మధుసుధన్ అన్నారు. దీంతో 2025 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 16 మిలియన్ టన్నులకు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నామన్నారు. 2018 నాటికి ప్లాంట్ ఆధునీకరణ పూర్తి అవుతుందని, దీంతో మరో మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరుగనుందన్నారు. 2025 నాటికి ఏకంగా 16ఎంపిటిఎకు చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడేళ్లలో ప్లాంట్ ఆధునీకరణ పూర్తి అయితే ప్రస్తుతమున్న 6.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 ఎంపిటిఎకు చేరుకుంటామన్నారు. కాగా మరో రెండు దశల్లో 16 ఎంపిటిఎకు విస్తరిస్తామన్నారు. ప్రతి మిలియన్ టన్ను ఉత్పత్తికి రూ.4,000 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మరో 9 ఎంటిల ఉత్పత్తికి మొత్తంగా 35,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.1,402 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని చెప్పారు.