Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరో ప్రముఖ సంస్థలో వాటాను కొనుగోలు చేశారు. తాజాగా ఆయన ఆన్లైన్ బుకింగ్ల ద్వారా టాక్సీ సేవలను అందించే ఓలాలో వాటాను చేజిక్కించుకున్నారు. అయితే టాటా ఎంత మొత్తం సంస్థలో పెట్టుబడులు పెట్టింది, ఎంత వాటాను చేజిక్కించుకున్న విషయాలను ఓలాలో సంస్థ బయటకు వెల్లడించ లేదు. టాటాకు ఉన్న వ్యక్తిగత సామర్థ్యం మేరకు ఆయన పెట్టుబడి పెట్టినట్లుగా ఓలాలో తెలిపింది. రత్ టాటా ఇప్పటికే స్నాప్డీల్ నుంచి మొదలుకొని జియోమీ సంస్థ వరకు పలు కంపెనీలు,స్టార్టప్ సంస్థలలో వ్యక్తిగత పెట్టుబడులను పెడుతున్న సంగతి తెలిసిందే. రతన్టాటా సంస్థలో భాగస్వామి కావడం తమకు గర్వకారణమని, ఆయన దిశానిర్దేశంలో తమ కంపెనీ వ్యాపారం కొత్త పుంతలు తొక్కగలదని ఓలాలో సంస్థ సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.