Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) నూతన అధ్యక్షుడిగా ఫోర్స్ మోటార్స్ చైర్మెన్ అభరు ఫిరొడియా ఎన్నిక య్యారు. ఫిరోడియా గతంలో 1990 నుంచి 1992 మధ్యకాలంలో సియామ్ అధినేతగా వ్యవహరించారు. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు రాజన్ వదేరా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరింగ్ (సియామ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మారుతీ సుజుకీ ఇండియా సంస్థ ఎండీ, సీఈవో కెన్నిచీ అయుకవా సంస్థ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిరోడియా 1975లో ఫోర్స్ మోటార్స్ బోర్డులో చేరారు. 2009 వరకు ఆయన సంస్థ ఎండీగా ఉంటూ కంపెనీని వృద్ధి పథంలో ముందుకు తీసుకుపోయారు. గత 60 ఏండ్లుగా ఫోర్స్ సంస్థ టెంపోతో పాటు ఆటోరిక్షాలు, మాటాడోర్ వంటి వాహనాలను తయారు చేస్తూ వస్తోంది.