Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదేండ్ల పాటు 8-10% వృద్ధి కావాలి
- భారత వృద్ధిలో స్థిరత్వం రాలేదు
- సర్కారు రొమ్ము చరచుకోవడం సరికాదు : ప్రభుత్వానికి రాజన్ హితవు
న్యూఢిల్లీ : భారత్ వేగంగా వృద్ధి పథంలో దూసుకుపోతోందంటూ ప్రభుత్వ వర్గాలు గొప్ప చెప్పుకోవడాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆక్షేపించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం కూడా భారత్ పొరుగున ఉన్న చైనాతో సమానంగా వృద్ధి చెందుతోందని చెప్పకొంటూ రొమ్ము చరచుకోని గర్వపడడం సరికాదని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కనీసం పదేండ్ల పాటు మెరుగైన వృద్ధి రేటు సాధించిన తరువాతే మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్టుగా చెప్పుకోవచ్చని మోడీ సర్కార్కు పరోక్షంగా చురకలు అంటించారు. భారత్ సంస్కృతి, గణమైన చరిత్రను గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పవచ్చుకానీ, వృద్ధి విషయంలో తాము మేటి అని చెప్పుకొనేందుకు గాను మన దేశం కనీసం పదేండ్ల పాటు 8 నుంచి 10 శాతం మేర మేటి వృద్ధిని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.
అంధుల రాజ్యంలో భారత్ ఒంటికన్ను రాజంటూ పదవిలో ఉండగా రాజన్ వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు రాజన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత వృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయిందని, అంతకు ముందు త్రైమాసికంలో ఇది 6.1 శాతంగా ఉందని పేర్కొన్నారు. కానీ మన పొరుగున ఉన్న చైనా వరుసగా గత రెండు త్రైమాసికాల కాలంగా 6.5 శాతం వృద్ధిని కొనసాగిస్తూ వస్తొందని పేర్కొన్నారు. మెరుగైన ఎగుమతులు, అధిక మొత్తంలో ప్రయివేటు పెట్టుబడులతో భారత్ 8 నుంచి 9 శాతం వృద్ధితో ముందుకుసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
ఈ స్థాయిలో 10 ఏండ్ల పాటు వృద్ధిని అందుకోగలిగితే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందతున్నట్టుగా ప్రపంచానికి గర్వంగా చెప్పుకొనేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. 1990 నుంచి మనం 6 నుంచి ఎనిమిది శాతం మధ్యలో వృద్ధితో ముందుకు సాగుతున్నామని, అయితే మరో రెండు శాతం వృద్ధిని అందిపుచ్చుకోని దశాబ్దం పాటు ఆదే వృద్ధి రేటును కొనసాగించగలిగితే అప్పుడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పకోవచ్చని అన్నారు.