Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో స్టాక్స్ లాభాల దన్నుతో సోమవారం ప్రధాన సూచీలు నెల రోజుల గరిష్టానికి చేరాయి. మరోవైపు ఎన్ఎస్ఈ నిప్టీ 10,000 మార్క్ స్థాయికి చేరింది. దీనికితోడు ఆసియా మార్కెట్ల పెరుగుదల కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 194.54 పాయింట్ల లాభపడి 31,882.16 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిప్టీ 71.25 పాయింట్లు పెరిగి 10,006 వద్ద స్థిరపడింది. ఇక ప్రధాన సూచీలు గత నాలుగు వారాల తర్వాత మొదటి వారాంతపు పతనాన్ని చవి చూసిన నేపథ్యంలో మదుపర్లు గ్లోబల్ రిస్క్లతో పాటు మంగళవారం వెలువడే వినియోగదారు ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టిపెట్టనున్నారు. దీనికితోడు ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి చేరే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్స్ విశ్లేషణను కూడా ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.