Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాణిజ్య విభాగం
దేశీయ ఐటీ, ఇంజినీరింగ్ సంస్థ సైయంట్ అమెరికా కేంద్రంగా డిజైన్ సేవలందిస్తున్న బీఅండ్ఎఫ్ డిజైన్ ఐఎన్సీని కొనుగోలు చేసింది. ఇందులో 100 శాతం వాటాను సైయంట్ కొను గోలు చేసింది. బీఅండ్ఎఫ్లో 47 మంది పని చేస్తున్నారని, ఈ కంపెనీ ఏడాదికి 8-9 మిలియన్ డాలర్ల రెవెన్యూ కలిగి ఉందని సైయంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలు ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక నిపుణుల చేయూతతో ఎరోస్పేస్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకొనే అవకాశం లభిస్తుందని సైయంట్ భావిస్తోంది. గత మూడు సంవత్సరాల కాలంలో సైయంట్ ఆరు కంపెనీలను స్వాధీనం చేసుకుంది. కాగా బీఅండ్ఎఫ్ను ఎంత మొత్తానికి సైయెంట్ కొనుగోలు చేసిందన్న విషయాన్ని ఆ కంపెనీ వెల్లడించలేదు.