Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంఆర్ గ్రూపు వార్షిక నివేదికలో వెల్లడి
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోని టెర్మినళ్ల సామర్థ్యాన్ని పెంచే ప్రక్రియలో ఉంది. ఈ విషయాన్ని తన వార్షికి నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ట్రాపిక్ డిమాండ్ను అధిగమించడానికి నూతన టెక్నలాజీ సొల్యూషన్స్ను అందిపుచ్చుకోనున్నట్లు తెలిపింది. దీంతో తదుపరి నిర్వాహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్దేశించుకుంది. హైదరాబాద్ ఎయిర్పోర్టు విస్తరణకు రూ.2,629 కోట్లు, న్యూఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విస్తరణ ప్రతిపాదనకు గాను రూ.16,000 కోట్ల పెట్టుబడులకు మదింపు నిపుణుల కమిటీ ఈ మధ్య కాలంలోనే అనుమతులిచ్చిందని జీఎంఆర్ తెలిపింది.దీనికితోడు సంస్థ యూరోపియన్ దేశాల ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. దక్షిణ తూర్పు ఆసియా, తూర్పు ఆసియాలోని విమానాశ్రయాల వ్యాపారం, నిర్వహణపై కన్నేసింది. విమానాశ్రయాల వ్యాపారం మెరుగైన వృద్ధితో ముందుకు సాగుతుందని జీఎంఆర్ గ్రూపు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది.