Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద జాబితా సిద్ధం
న్యూఢిల్లీ: డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తు అక్రమాలకు పాల్పడిన వారిపై వేటు వేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. అనర్హత వేటే వేసేందుకు గాను డొల్ల కంపెనీల్లోని దాదాపు 1.06 లక్షల మంది డైరెక్టర్లను గుర్తించినట్టుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డొల్ల కంపెనీల ఏర్పాటు వెనుక ఉన్న అసలు ప్రయోజనాలు ఎమిటి అన్న విషయంతో పాటు.. ఆయా కంపనీల్లో ఇంకా ఎంత మంది డైరెక్టర్లు ఉన్నారనే విషయాన్ని విశ్లేషించేందుకు గాను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వారితో కలిసి పనిచేస్తూ తాము వివరాలను సమీకరిస్తున్నట్టుగా సర్కారు తెలిపింది. ఆయా కంపెనీల్లో డైరెక్లర్ల ప్రొఫైల్ వారి పూర్వపరాలు కంపెనీల్లో వారి పాత్రతో సహా అన్ని వివరాలను సమీకరిస్తున్నట్టుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ వివరించింది. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల వారితోనూ సరిపోల్చుకుంటున్నట్టుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ కంపెనీల ద్వారా ఎమైనా మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు జరిగాయా అన్న అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్టుగా ఆ శాఖ తెలిపింది. డొల్ల కంపెనీలకు సంబంధించిన కొన్ని అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్న చార్టర్డ్ అకౌంటెట్లు, కంపెనీ సెక్రెటరీలు ఇతర ప్రొఫెషనల్స్ను తాము ఇప్పటికే గుర్తించి వారిపై ఐసీఏఐ, ఐసీఎస్ఐ, ఐసీవోఏఐతో పాటు ఇతర ప్రొఫెషనల్ సంస్థలు చేపడుతున్న చర్యలను కూడా తాము పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపింది. ఆయా సంస్థలు సర్కారు గుర్తించిన డొల్ల కంపెనీల లావాదేవాల్లీ నిజాలను నిగ్గు తేల్చే వ్యవహారాన్ని ప్రాధాన్యతతతో పరిశీలిస్తున్నట్టుగా కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి. చౌదరీ తెలిపారు.