Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్ఎన్ఎల్ సంస్థ భారం
- తగ్గించుకొనే దిశగా తొలి అడుగు !
- స్వతంత్య్ర సంస్థగా మార్చి వాటా విక్రయం
- సమ్మతి తెలిపిన కేంద్ర క్యాబినెట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వదిలించుకొనే దిశగా సర్కారు తొలి అడుగు వేసింది. గత కొంత కాలంగా వివాదాస్పదమవుతున్న బీఎస్ఎన్ఎల్ వాటా విక్రయం విషయమై కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆయువుపట్టైన టెలికాం టవర్ల వ్యాపారాన్ని ఒక విడి సంస్థగా మార్చి అందులో వాటా విక్రయించేందుకు కేంద్ర మంత్రివర్గం సమ్మతి తెలిపింది. బీఎస్ఎన్ఎల్ టవర్స్కు సంబంధించిన వ్యాపారాన్ని ఒక స్వతంత్య్ర సంస్థగా విక్రయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు సర్కారు వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 4,42,00 మొబైల్ టవర్లలో దాదాపు 15 శాతం టవర్లు అంటే దాదాపు 66,000 టవర్లు బీఎస్ఎన్ఎల్ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు టవర్ల వ్యాపారం విక్రయంతో ఇకపై బీఎస్ఎన్ఎల్ సంస్థ పోటీ ప్రయివేటు సంస్థలకు దీటుగా విస్తరించడానికి వీలులేకుండా పోతోంది. విస్తరణకు గాను ఆ సంస్థ ఇకపై ఇతర సంస్థల టవర్లను వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో పాటుగా నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఉన్న జాతీయ రహదారి నంబరు 16 నుంచ ఆరు వరుసల రహదారిగా మార్చే ప్రతిపాదనకు కూడా కేంద్ర మంత్రివర్గం తన సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్టు ఖర్చును సర్కారు రూ.1,423 కోట్లుగా నిర్ణయించారు. దాదాపు 54 కి.మీ. పరిధిలో ఈ రహదారిని ఆరు వరుసలుగా మార్చనున్నారు.
చమురు నిక్షేపాల అన్వేషణకు రూ.3000 కోట్లతోభారీ ప్రాజెక్టు!
దేశంలో చమురు, సహజ వాయువు నిక్షేపాల అన్వేషణను మరింత తీవ్రతరం చేసే దిశగా సర్కారు మంగళవారం కీలక నిర్ణయం తీసుకొంది. దాదాపు రూ.3000 కోట్ల వ్యవయంతో దేశంలోని తీర ప్రాంతాలతో పాటు చమురు నిక్షేపాలు అధికంగా ఉండేందుకు అవకాశాలున్న ప్రాంతాలను ఖచ్చింతంగా గుర్తించేందుకు గాను దాదాపు 2డీ సిస్మిక్ డేటాను సమీకరించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు దేశంలోని 48,243 లైన్ కిలోమీటర్లకు సంబంధించిన 2డీ సిస్మిక్ డేటాను సమీకరించానున్నారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టునున్నాయి.
గ్రాట్యుటీ పన్ను మినహాయింపు రూ.20 లక్షలకు పెంపు
సంఘటిత రంగంలో ఉద్యోగులకు గ్రాట్యుటీపై ఇస్తోన్న గరిష్ట పన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ మంగళవారం సమ్మతి తెలిపింది. ఈ సవరణతో ప్రభుత్వ అజమాయిషీ కింద పని చేస్తున్న సంస్థలు, ప్రయివేటు సంస్థలు, పబ్లిక్ అండర్టేకింగ్ సంస్థలు, స్వతంత్ర సంస్థలలో పని చేస్తున్న వారికి మేలు జరిగనుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ పరిధిలోకి రాని వారికి ఈ కొత్త సవరణ వల్ల లబ్ది జరగనుంది. ప్రస్తుతం సంఘటిత రంగంలోని ఉద్యోగులకు గ్రాట్యుటీ అప్పర్ సీలింగ్ రూ.10 లక్షలుగా ఉంది. తాజాగా అమలులోకి వచ్చిన ఏడవ సెంట్రల్ పే కమిషన్ సిఫారసుల అమలు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ సీలింగ్ రూ.20 లక్షలకు పెరిగిన సంగతి తెలిసిందే.