Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామ్రాజ్ కాటన్స్ చైర్మెన్ వెల్లడి
- బనియన్ల ప్రచారానికి రానా
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం వ్యాపారంలో 20 శాతం వృద్ధి అంచనా వేస్తున్నామని రామ్రాజ్ కాటన్స్ చైర్మెన్ కెఆర్ నాగరాజన్ అన్నారు. 2016-17లో రూ.1200 కోట్ల వ్యాపారం నమోదు చేశామని తెలిపారు. జీఎస్టీ వల్ల ప్రస్తుత ఏడాదిలో తమ వృద్ధి రేటు కొంత తగ్గొచ్చన్నారు. మొత్తం వ్యాపారంలో 10 శాతం ఎగుమతులూ ఉన్నాయన్నారు. సంస్థ బనియన్ల విభాగానికి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానాను బ్రాండ్ అంబాసీడర్గా నియమించుకున్నామని తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం హైదరాబాద్లో రానాతో కలిసి నాగరాజన్ మీడియాతో మాట్లాడారు. తమ మొత్తం వ్యాపారంలో బనియన్ల విభాగం వాటా 30 శాతంగా ఉందన్నారు. రానా ప్రచారంతో వచ్చే రెండు, మూడేండ్లలో ఈ వాటాను 50 శాతానికి పెంచుకోవాలని నిర్ధేశించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం తాము పంచలు, దోతులు, చొక్కాలు, బనియన్ల ఉత్పత్తిలో ఉన్నామన్నారు. తమ మొత్తం రెవెన్యూలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30 శాతం వాటా వస్తుందన్నారు. ఈ రెండు రాష్ట్రాలు తమకు కీలకమైనవేనని అన్నారు. అదే విధంగా ఉత్తరాధికి విస్తరించే పనిలో ఉన్నామన్నారు. రామ్రాజ్ కాటన్కు మూడు తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు. మరో ప్లాంట్ తెలుగు రాష్ట్రాల్లో పెట్టే యోచనలో ఉన్నామన్నారు.