Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు పారిశ్రావి ుకోత్పత్తి పడిపోవడం కూడా మార్కెట్లను నిరుత్సాహపర్చింది. విదేశీ సంస్థాగత మదుపర్లు నిధులు తరలించుకుపోవడంతో పాటు ముఖ్యంగా చివరి గంటన్నరలో మదుపర్లు అమ్మకాలకు పాల్పడి లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బుధవారం భారత మార్కెట్లు ఊగిసలాటకు గురి అయ్యాయి. తుదకు సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, నిఫ్టీ నష్టాలు చవి చూసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 27.75 పాయింట్లు పెరిగి 32,186.41 వద్ద ముగిసింది. ఓ దశలో ఏకంగా 190 పాయింట్లు లాభపడింది. చివరి గంటన్నర సమయంలో మదుపర్లు భారీగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో తుదకు 27 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. క్రితం ఐదు సెషన్లలో 524.44 పాయింట్లు పెరిగింది.
కాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 13.75 పాయింట్లు తగ్గి 10,079.30 వద్ద ముగిసింది. ముఖ్యంగా బీపీసీఎల్, ఐవోసీ, ఐటీసీ, ఇండియాబుల్స్ హౌసింగ్, ఐచర్ మోటార్స్ సూచీలు మార్కెట్లను ప్రతికూలతకు గురి చేశాయి.