Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రమఖ టెలిఫోన్ ఆపరేటర్ వొడాఫోన్ ఇండియా తమ వినియోగ దారులకు కోసం అపరిమిత ఇంటర్నేషనల్ ప్లాన్ను బుధవారం ప్రారంభించింది. ఒక రోజుకు రూ.180లకే యూకే, యూరప్ ప్రాంత ప్రయాణికులకు ఈ అపరిమిత ప్లాన్ను తీసుకొచ్చినట్టు పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులు ఇప్పుడు చాలా సులువుగా ఈ ప్యాక్ను యాక్టివేట్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీనికితోడు యూకే, యూరప్లోని ప్రముఖ సందర్శన ప్రాంతాల నుంచి తమ నెంబర్ను ఉపయోగించుకోవచ్చని వొడాఫోన్ పేర్కొంది. కాగా ఇదే ప్యాక్పై ప్రయాణికులు అపరిమిత కాల్స్తో పాటు డేటాను అమెరికా, యూఏఈ, సింగపూర్, మలేషియా దేశాల్లోనూ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే దీంట్లో యూరప్ను మినహాయించినట్టుగా పేర్కొంది. మొత్తం 18 దేశాల్లోకి ఈ ప్యాక్ను అందుబాటులోకి తేచ్చినట్టుగా వెల్లడించింది. ఈ ప్యాక్ కింద 28 రోజులకు రూ.5000, 24 గంటల వాడకానికి రూ.500 ధరల శ్రేణి కూడా ఉందని పేర్కొంది. ఏప్రిల్లోనే అమెరికా, సింగపూర్, యూఏఈలకు తమ అపరిమిత అంతర్జాతీయ రోమింగ్ను ప్రారంభించామని, ప్రస్తుతం ఈ ప్యాక్ను మరిన్ని ప్రాంతాలకు విస్తారిస్తున్నామని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అన్వేష్ ఖోస్లా తెలిపారు.