Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ ధన్ యోజన పథకంలో ఇప్పటి వరకూ 30కోట్ల మంది బ్యాంకు ఖాతాలు పొందారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన 'ఫైనాన్సీయల్ ఇంక్లూజన్' సదస్సులో జైట్లీ మాట్లాడుతూ జన్ ధన్ యోజన కంటే ముందు 42 శాతం కుటుంబాలు బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నాయన్నారు. అదే విధంగా ఈ పథకంలోని జీరో బ్యాలెన్స్ ఖాతాలు 77 శాతం నుంచి 22 శాతానికి తగ్గాయన్నారు. నోట్ల రద్దు వల్ల పన్ను వసూళ్లు విస్తృతం అయ్యాయని తెలిపారు. అదే విధంగా వ్యవస్థలో నగదు లావాదేవీలు తగ్గాయన్నారు.