Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత మార్కెట్లో ఈ నెల 29న లభ్యం
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి ఖరీదైన స్మార్ట్ఫోన్లను విక్రయించే ఆపిల్ కొత్తగా ఆవిష్కరించిన మూడు స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాగా వీటి కనీస ధరలు రూ.64,000 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. ఐఫోన్ పదో వార్షికోత్సవం సందర్బంగా ఐఫోన్ టెన్తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్లను మంగళవారం ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా ఈ ఫోన్లు సెప్టెంబర్ చివరి వారంలో భారత మార్కెట్లోకి రానున్నాయని బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 29 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ఫోన్లను భారత్లో విక్రయించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సంస్థ అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక ఫీచర్లతో విడుదల చేసిన ఐఫోన్ టెన్ నవంబర్ 3 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీని ప్రారంభ ధర రూ.89,000గా ఉంటుందని తెలిపింది. ఈ ఫోన్ల కోసం దేశంలోని తమ అధికారిక స్టోర్లలో సెప్టెంబర్ 17 నుంచి వీటి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.64,000గా నిర్ణయించినట్లు తెలిపింది.
ఐఫోన్ టెన్ ప్రత్యేకతలు..
5.8 అంగుళాల తెర, అత్యధిక స్పష్టత కోసం అధిక రిజల్యూషన్ డిస్ప్లే, 3డీ సెన్సార్లు, 3డీ స్కానర్ సాయంతో ముఖాకతితో అనిమొజి రూపొందించే సదుపాయం, 12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమేరాలు, 64 జీబీతో పాటు 256 జీబీ వరకు మోడళ్లూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఫోన్లను అన్లాక్ చేయడానికి ఫింగర్ ఫ్రింట్, చేతి బటన్ వంటివి ఉపయో గించగా, ఐఫోన్ టెన్ మాత్రం యజమాని ఫోన్ను తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని, కండ్లతో చూడటం ద్వారా అన్లాక్ అవు తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీని ప్రత్యేకతే.
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్
ఐఫోన్ 8కు 4.7 అంగుళాల తెర, ఐఫోన్ 8ప్లస్కు 5.5 అంగుళాల తెర ఉన్నాయి. సిల్వర్, గ్రే, రోజ్గోల్డ్ రంగుల్లో రూపొం దించారు. ఇక ఐఫోన్ 8కు 12 మెగాపిక్సెల్ కెమేరా ఉండగా, ఐఫోన్ 8 ప్లస్కు డ్యూయల్ కెమేరా అమర్చారు. వీటి తెరలకు గ్లాస్ అమర్చారు. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ మోడళ్లలో 64 జీబీ మెమొరీతో పాటు 256 జీబీ మెమొరీ కలిగిన మోడళ్లూ ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయం ఈ ఫోన్లకు ఉంది.