Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సైయెంట్ సంస్థ అనుబంధ సంస్థల్లో తన వాటాను విక్రయిస్తూ వస్తోంది. ప్రధాన వ్యాపారంపై వ్యూహాత్మకంగా మరింత దృష్టి నిలిపేందుకు గాను సైయెంట్ తాజాగా మరో అనుబంధ సంస్థలో తన వాటాను విక్రయించింది. ఇన్ఫోటెక్ ఎయిరోస్పేస్ సర్వీసెస్లో (ఐఏఎస్ఐ)లో తన 49% వాటాను ప్రాట్ అండ్ విట్నీ సంస్థకు విక్రయించింది. దీంతో ఐఏఎస్ఐ సంస్థ పూర్తిగా ప్రాట్ అండ్ విట్నీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. అప్రాధాన్యత వ్యాపారాల నుంచి విక్రయించే క్రమంలో భాగంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సైయెంట్ సీఈవో, ఎండీ కృష్ణా బోధనపు వెల్లడించారు.