Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కార్పొరేషన్ బ్యాంక్కు రాజభాష పుర స్కారం అవార్డు లభించింది. కార్యాలయాలతో పాటు తన శాఖల ద్వారా దేశవ్యాప్తంగా అధికార భాషాను అద్భుతంగా అమలు చేస్తుండటంతో కార్పొరేషన్ బ్యాంక్కు ఈ అవార్డు దక్కింది. దేశంలోని జాతీయ బ్యాంకుల కేటగిరీలోని 'సీ' రిజియన్ కింద కార్పొరేషన్ బ్యాంకును రెండో బహుమతి వరించింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా కార్పొరేషన్ బ్యాంకు సీఈవో జైకుమార్ గార్గే ఈ అవార్డును అందుకున్నారు. అధికార భాష అమలు విషయంలో కార్పొరేషన్ బ్యాంకు ఎప్పుడు మార్గదర్శకులుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో బ్యాంకు ఎన్నో మైలురాళ్లను దాటిందని కూడా పేర్కొన్నారు.