Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రయివేటుకు భాగస్వామ్యం పద్ధతిలో నిధుల సమీకరించుకునేందుకు అనుమతించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ సూచించారు. ఇదే సమయంలో ఈ వాటా 49 శాతానికి మించకుండా జాగ్రత్తపడాలని అన్నారు. మరోవైపు దేశానికి అవసరమైన కొన్ని బ్యాంకులను ప్రభుత్వ అధీనంలో ఉంచుకోవాలని వివరించారు. ఫలితంగా మూలధనం అందుబాటులోకి వస్తుందని, తద్వారా బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు అవకాశాలు లభిస్తాయని రంగరాజన్ తెలిపారు. మిగతా వాటిని ప్రయివేటు పరం చేయాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.