Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.400 కోట్ల ఇష్యూకు..రూ.52,000 కోట్ల బిడ్లు..
ముంబయి: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ కెపాసిట్ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పబ్లిక్ ఇష్యూకు మదుపరుల నుంచి బంపర్ స్పందన లభించింది. శుక్రవారం ఇష్యూ ముగిసే సమయానికి ఈ ఐపీవోకు మదుపరుల ఉనంచి 187 రెట్ట మేర స్పందన లభించింది. ఐపీవో కింద సంస్థ 1,14,28,572 షేర్లను ఇష్యూకు ఉంచగా మదుపరుల నుంచి 2,08,85,36,100 బిడ్లు లభించాయి. అంటే దాదాపు రూ.400 కోట్ల ఇష్యూకు రూ.52,000 కోట్ల మేర బిడ్లు లభించినట్టయింది. ఇష్యూలో అర్హత కలగిన సంస్థాగత కొనుగోలు దారుల వాటాకు దాదాపు 134 రెట్ల మేర స్పందన లభించింది. సంస్థాగతేతర విభాగంలో 651 రెట్ల మేర అధిక స్పందన లభించింది.