Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైపుణ్యత కొరతే ప్రధాన కారణం: ఫిక్కీ
న్యూఢిల్లీ : వివిధ రంగాల్లో పని చేసే వారు తమ నైపుణ్య కొరత కారణంగా వచ్చే ఐదేళ్లలో భారీగా ఉద్యోగాలు కోల్పోనున్నారని ఫిక్కీ ఒక నివేదికలో తెలిపింది. నైపుణ్యం కొరత కారణంగా వచ్చే అయిదేండ్లలో అంటే 2022 నాటికి ఏకంగా 21 శాతం మంది కొలువులు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఫిక్కీ విశ్లేషించింది. ఉద్యోగాల కల్పనపై ఫిక్కీ 132 పేజీల రిపోర్టును విడుదల చేసింది. నైపుణ్యత పెంచే విద్యా మెలుకువలు అవసరమని నొక్కి చెప్పింది. ఫిక్కీ రిపోర్టు ప్రకారం.. దేశంలో జనాభాపరమైన మార్పులు, ప్రపంచీకరణ, భారతీయ పరిశ్రమల ఆధునిక సాంకేతికీకరణ లాంటి వివిధ అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు ఇతర పరిశ్రమలు ఈ దిశగా కృషి మొదలు పెట్టాలని తెలిపింది. 2022 నాటికి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నలాజీ (ఐటి) రంగంలో అత్యధిక ఉద్యోగాలు ఊడొచ్చని అంచనా వేసింది. ప్రధానంగా ఈ రంగంలో నైపుణ్యం పెంపునకు అత్యధిక అవశ్యకత ఉంది. వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం ఐటి రంగ ఉద్యోగులు ముపును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రంగంలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, వైర్లెస్ నెట్వర్క్, నిపుణులు, డేటా ఎనలిస్టులు, యాండ్రాయిడ్ డెవలపర్ తదితర కేటగిరీల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. అదే విధంగా వస్త్ర, ఆటోమొబైల్, రిటైల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఇతర రంగాల్లోనూ వేగంగా మార్పులు జరగనున్నాయి. భవిష్యత్తులో దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆన్లైన్, ఎక్స్పోనెన్షియల్ టెక్నాలజీ రంంలో విస్తృతావకాశాలు ఉంటాయని ఈ రిపోర్టు విశ్లేషించింది. టెక్నాలజీ ఎగ్రిగేటర్ మోడల్ ఉబెర్ లాంటివి రెండవ కీలక రంగంగా ఉండొచ్చు. జనరల్, టెక్నికల్, వత్తిపరమైన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తీసుకురావాలని, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.