Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు వేడుకగా జరిగాయి. బ్యాంకు ప్రధాన కార్యాలయంతో పాటు దేశంలోని అన్నిబీవోఎం జోన్ కార్యాలయాల్లో బ్యాంకు 83 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవస్థాపక దినోత్స వేడుకల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బ్యాంకు జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ నాదేండ్ల రాంబబు స్వాగతోపన్యాసంతో వేడుకలు ప్రారంభమైయ్యాయి. బ్యాంకు ఉన్నతాధికారులు, సిబ్బంది, వినియోగదారులను ఉద్దేశించిన రాంబబు చేసిన కీలకోపన్యాసం బ్యాంకు ప్రస్థానాన్ని తెలియజేస్తూనే.. భవిష్యత్తు కార్యాచరణను సిబ్బందికి తెలియజెప్పింది. బ్యాంకు ప్రస్థానాన్ని తెలియపరుస్తూ రూపొందించిన షార్ట్ఫిల్మ్ను ప్రదర్శన ఆహూతులను అలరించింది. బ్యాంకు బీమా వ్యాపార భాగస్వాములైన మెసర్స్ సిగ్మా టీటీకే, మెసర్స్ ఫ్యూచర్ జనరలీ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై తమ ఉత్పాదనల గురించి వినియోగదారులకు తెలియపరిచారు. కార్యక్రమానికి గురుదీప్ సింగ్ వసూ ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంగించారు. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.