Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'లక్ష్మి' పేరుతో సొంత డిజిటల్ కరెన్సీ
- ప్రయోజనకరమేనన్ని ఉన్నతాధికార కమిటీ అభిప్రాయం
- సర్కారు నిర్ణయం రాగానే చట్టాల సవరణకు చర్యలు
- ఆర్బీఐ ఆధ్వర్యంలో చలామణికి ప్రణాళికలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: అంతర్జాతీయంగా చలామణిలో ఉన్న డిజిటల్ కరెన్సీ బిట్కాయిన్ మాదిరిగానే.. భారత్లోనూ ప్రత్యేక క్రిప్టోకరెన్సీని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చే విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడిన ఒక కమిటీ చర్చలు జరిపింది. భారత్కు విడిగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తేవడం లాభదాయకంగానే ఉంటుందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆర్థిక మంత్రి జైట్లీ బిట్కాయిన్పై ఆర్థిక శాఖలో అంతర్గత సమావేశం నిర్వహించిన సమయంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టుగా సమాచారం. బిట్కాయిన్ తరహాలో తీసుకు రానున్న డిజిటల్ కరెన్సీకి సర్కారు 'లక్ష్మి' అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటిని ఆర్బీఐ నుంచి జారీ చేయాలని అధికారులు సర్కారుకు సూచిస్తున్నారు. అయితే ఇందుకు కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు గాను దేశంలోని కరెన్సీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, చైనాతో పాటు పలు దేశాలు కూడా తమతమ దేశాలకే ప్రత్యేకంగా నిలిచే డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ సర్కారు కూడా ఈ దిశగా అడుగులు వేస్తుండడం విశేషం.
బిట్కాయిన్ అంటే...
ఇదో తరహా డిజిటల్ కరెన్సీ. ఆన్లైన్లో కొని.. ఆన్లైన్లో మాత్రమే వాడుకోగలిగే కరెన్సీ. డాలర్, యూరో, మన రూపాయి వంటి కరెన్సీల్లా దీన్నెవరూ ముద్రించరు. రిజర్వు బ్యాంకుల మాదిరిగా దీనిపై ఎవరి నియంత్రణా ఉండదు కూడా.. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో శక్తిమంతమైన కంప్యూటర్లు, సర్వర్లను ఉపయోగించి దీన్ని సష్టించే వ్యక్తుల్ని మైనర్స్గా పిలుస్తుంటారు. ఈ మైనింగ్ టీమ్లో ఎవరైనా చేరొచ్చు. ఈ నెట్వర్కే బిట్కాయిన్ లావాదేవీల్ని పారదర్శక పద్ధతిలో బ్లాక్చెయిన్ ద్వారా నమోదు చేస్తుంది. అంటే! బిట్కాయిన్లకు తమ సొంత పేమెంట్ గేట్వే ఉందన్నమాట. బిట్కాయిన్లను జపాన్కు చెందిన సతోషి నకమొతో 2008లో సష్టించారు. వ్యక్తుల నుంచి వ్యక్తులకు డిజిటల్ రూపంలో మార్చుకునే కరెన్సీగా... ఏ నియంత్రణా లేని కరెన్సీగా ఇది చలామణిలోకి వచ్చింది. కాకపోతే దీన్ని ఆన్లైన్ సైట్లు, ఇతర వ్యాపారులు తీసుకోవటం 2009 నుంచీ మొదలయింది. ఎంత మైనర్లయినా... ఎంత శక్తిమంతమైన కంప్యూటర్లయినా.. ఈ బిట్కాయిన్లను 2.1 కోట్లకు మించి సష్టించలేవు. అంటే ఏ దశలోనైనా 2.1 కోట్లకన్నా ఎక్కువ బిట్కాయిన్లుండే చాన్సు లేదన్న మాట. కాకపోతే వీటిని ముక్కలుగా విడగొట్టేందుకు మాత్రం వీలవుతుంది. ప్రస్తుతం బిట్కాయిన్ను అత్యంత తక్కువ డినామినేషన్లో... 10 కోట్ల వ వంతుకు విడగొడుతున్నారు. వీటిని 'సతోషి'గా పిలుస్తున్నారు. అంటే... 10 కోట్ల సతోషిలు కలిస్తే ఒక బిట్కాయిన్ అన్నమాట. చిల్లర సమస్య కూడా ఉండదు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా బిట్కాయిన్లనకు ఆదరణ పెరుగుతోంది. ఆమోదం పెరుగుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతోంది. ఇటీవల కొన్ని ఆంక్షల నేపథ్యం బిట్కాయిన్ విలువ దిగి వచ్చినప్పుటికీ సామాన్యుడికి అందని స్థాయిలోనే ఉండడం విశేషం.