Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో దేశీయంగా బంగారం దిగుమతులు మూడింతలు పెరిగి 15.24 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దేశీయ కరెంట్ అకౌెంట్ లోటు (సీఏడీ)లో బంగారం దిగుమతులు 2016-17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్యలో కేవలం 5.08 బిలియన్ డాలర్లు మాత్రమే నమోదు కావడం విశేషం. గత నెల ఆగస్టులో పసిడి దిగుమతులు 1.88 బిలియన్ డాలర్లకు పెరగ్గా, అంతకు క్రితం సంవత్సరం ఇదే నెలలో 1.11 బిలియన్ డాలర్లుగా ఉంది. రాబోయే పండగ సీజన్ దష్ట్యా దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా. చైనా తర్వాత భారీగా బంగారం వినియోగించే రెండో అతిపెద్ద దేశం భారత్. ఆభరణాల తయారీ కోసమే దేశ ప్రజలు ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం బంగారం దిగుమతులపై 10శాతం పన్ను విధిస్తున్న సంగతి తెలిసిందే. రత్నాలు, జ్యువెలరీ పరిశ్రమతో పాటు వాణిజ్య మంత్రిత్వశాఖ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థికమంత్రిత్వశాఖను కోరుతున్నాయి.