Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, ఎస్బీఐ లైఫ్ పబ్లిక్ ఇష్యూ ఆఫర్, ఉత్తర కొరియా అంశాలు దిశానిర్దేశం చేయనున్నాయని నిపుణులు పేర్కొంటు న్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలరుతో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, రుతుపవనాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) సైతం పరపతి సమావేశాలు వంటి తదితర అంశాలు కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక అంశాలు పెద్దగా లేకపోవడంతో ఈ వారం ట్రెండ్ విదేశీ అంశాలపైనే ఆధారప డనున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గత శుక్రవారం ఉత్తర కొరియా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించిదన్న వార్తల నేపథ్యంలో వారాంతంలో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్ 31 పాయింట్ల లాభపడి 32,273 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ 1.20 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,085.40 వద్ద స్ధిరపడింది. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్లు బులిష్ను కొనసాగిస్తాయో లేదో వేచి చూడాలి..
ఫెడ్ సమావేశాలు కీలకం
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మంగళవారం(19న) పాలసీ సమీక్షను చేపట్టనుంది. రెండు రోజులపాటు జరగనున్న సమావేశం బుధవారం ముగుస్తుంది. వడ్డీ రేట్లపై ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిర్ణయాలు బుధవారం వెలువడనున్నాయి. కాగా జూన్ సమావేశంలో వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడం తద్వారా ఫెడ్ ఫండ్స్ రేటును 1- 1.25 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. మరోవైపు గురువారం(21న) బీవోజే పరపతి నిర్ణయాలు వెల్లడించనుంది. ఇంతక్రితం జూలైలో నిర్వహించిన పాలసీ సమావేశంలో బీవోజే వడ్డీ రేట్లను మార్పులు చేపట్టకుండా -0.1 శాతంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఈ అంశాలు మార్కెట్లను ప్రభావితం చేయగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎస్బీఐ లైఫ్ ఐపీవో
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతోంది. స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీవో 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇప్పటికే ఐపీవోకి వచ్చిన పలు కంపెనీలు రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. దీంట్లో ప్రధానంగా కెపాసిట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి అదుÄ్భతమైన స్పందన లభించింది. ఈ ఐపీవోకు ప్రారంభం నుంచే మంచి ఆదరణ లభించగా.. చివరి రోజున భారీగా బిడ్డింగ్ దాఖలు అయ్యాయి. మరో విషయం ఏమిటంటే ఈ కంపెనీ రూ. 400 కోట్ల కోసం ఐపీవోకు రాగా.. 182.72 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ కావడం విశేషం. దీనికితోడు ఈ నెల 8న పబ్లిక్ ఇష్యూలు ముగించిన రెండు కంపెనీలు సోమవారం(18న) స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్ కానున్నాయి. దీంట్లో ఒకటి డిక్సన్ టెక్నాలజీస్. రెండోది భారత్ రోడ్ నెట్ వర్క్. వీటితో పాటు ఈ నెల 13కల్లా దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ సగటుకంటే 6 శాతం తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో ఈ వారం మార్కెట్ సెంటిమెంటుకు ఇవి కీలకంగా మారనున్నాయి.
కరెంటు అకౌంట్ లోటు..
దేశీయ కరెంటు అకౌంట్ లోటు నాలుగేండ్ల గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ తొలి త్రైమాసికంలో 14.3 బిలియన్ యూఎస్ డాలర్లకు క్యాడ్ చేరింది. మార్చి త్రైమాసికంలో 3.4 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 2.4 శాతంగా నమోదైంది. జీఎస్టీ అమలుతో బంగారం దిగుమతులు భారీగా పెరగాడం ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఆందోళనకరమని వారు చెబుతున్నారు. వాణిజ్య లోటు 41.2 బిలియన్ డాలర్లకు చేరడమే కరెంటు ఖాతా లోటుకు కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు పేర్కొంటున్నాయి.