Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : జాతీయ, అంతర్జాతీయ సానుకూల అంశాల మద్ధతుతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో సూచీల ర్యాలీతో బీఎస్ఈ సెన్సెక్స్ 151.15 పాయింట్లు పెరిగి 32,423.76కు చేరింది. ఇంతక్రితం ఏడు సెషన్లలో ఈ సూచీ మొత్తంగా 610.64 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 68 పాయింట్లు రాణించి 10,153 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారిగా కాపిటల్ గూడ్స్ 1.47 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 1.43 శాతం, ఆటో 1.24 శాతం, బ్యాంకింగ్ 0.71 శాతం చొప్పున రాణించాయి. మరోవైపు ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాత్రం 0.07 శాతం తగ్గింది. సెన్సెక్స్లో బజాజ్ ఆటో 3.57 శాతం, హెచ్యూఎల్ 2.77 శాతం, ఎల్అండ్టీ 2.09 శాతం, కోల్ ఇండియా 1.89 శాతం, సిప్లా 1.7 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో టాప్లో ఉన్నాయి.