Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వినియోగదారు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీ మార్కెట్లో సోమవారం నమోదు అయ్యాయి. లిస్టింగ్ రోజే ఈ స్టాక్ మదుపరులకు అనూహ్య లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ.1,766 కాగా.. దాదాపు 54శాతం ప్రీమియంతో రూ.2,755 వద్ద మార్కెట్లో లిస్టయింది. ఒకానొక దశలో ఈ స్టాక్ రూ.3020 గరిష్టాన్ని తాకింది. అనంతరం ఇది 64శాతం వృద్ధితో రూ. 2,892 వద్ద ముగిసింది. తాజా ఐపీవో ద్వారా సంస్థ దాదాపు రూ. 600కోట్ల మేర నిధులను సమీకరించింది. సంస్థ ఐపీవోకు దాదాపు 83 రెట్ల స్పందన లభించిన సంగతి తెలిసిందే.
ఐసీఐసీఐ లాంబార్డ్కు 97.60% స్పందన..
దాదాపు రూ. 5,700 కోట్ల మేర నిధుల సమీకరణ కోసం ప్రాథమిక మార్కెట్లోకి వచ్చిన ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్్స కంపెనీ ఐపీవోకు మదుపరుల నుంది స్పందన మందకొడిగా కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజైన సోమవారం మదుపరుల నుంచి దాదాపు 97.60 శాతం స్పందన లభించింది. 6,16,66,740 షేర్లకు గాను సోమవారం సాయంత్రానికి 6,01,87,028 బిడ్లు లభించాయి.