Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తన భారత్ సిరీస్ మోడళ్లను విస్తరిస్తుంది. ఇందులో భాగంగా మొదటిసారి స్మార్ట్ఫోన్ ఉపయోగించే వారిని లక్ష్యం చేసుకోవడంతో పాటు ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ఫోన్కు వచ్చే వారిని దృష్టిలో పెట్టుకోని భారత్-3, భారత్-4 సిరీస్లో రెండు బడ్జెట్ ఫోన్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4,499, రూ.4999గా కంపెనీ నిర్ణయించింది. వీటిలో ఫీచర్లు ఇలా ఉన్నాయి. భారత్-3 స్మార్ట్ఫోన్ 4.5 అంగుళాల తెర, 5 ఎంపీ వెనుక, ముందు కెమేరా, మీడియాటెక్ ఎంటీ6737 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో పాటు 1జీబీ ర్యామ్, ఓటీజీ సపోర్టు, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, డ్యూయల్ సిమ్, 4జీ వోల్ట్, యాండ్రాయిడ్ నోగట్పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. అలాగే భారత్-4 స్మార్ట్ఫోన్ 5 అంగుళాల తెర, 2,500 బ్యాటరీ సామర్థ్యంతో లభించగా.. మిగతా అన్ని ఫీచర్లు భారత్-3లో ఉన్నవేనని కంపెనీ పేర్కొంది. రిటైల్ చానెల్స్ ద్వారా నేటి నుంచే ఈ ఫోన్ల్ అమ్మకాలను ప్రారంభించినట్టుగా కంపెనీ తెలిపింది.