Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నోట్ల రద్దు లాభాలపై జైట్లీ కొత్త భాష్యం
- ఆ తరువాత వాడకం తగ్గిందని వివరణ
- టెక్నాలజీ దన్నుతో పుంజుకుంటోందట!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు కారణం గా తప్పని పరిస్థితుల్లో ప్రజలు డిజిటల్ లావాదేవీల దిశగా దృష్టి సారించడం మొ దలు పెట్టినప్పటికీ.. తరువాత కాలంలో చాలామంది ప్రజలకు ఇదిఒక అభిరుచి గా మారిపోయిందని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ అన్నారు. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'తేజ్' (అన్నింటికంటే వేగంగా) డిజిటల్ పేమెంట్ మొబైల్ యాప్ను ఆయన ఇక్కడ ప్రారంభించి ప్రసంగించారు. సర్కారు చేపడుతున్న చర్యలు, అత్యాధునిక టెక్నాలజీ కారణంగా డిజిటల్ లావాదేవీలు జోరందుకుంటు న్నట్టు ఆయన వివరించారు. నోట్ల రద్దు సమయంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య అత్యున్నత స్థితికి చేరుకున్నప్పటికీ ఆ తరువాత కాలంలో ఇది కొంత పడిపోయిన సంగతి వాస్తవమేనని ఆయన అన్నారు. తాజాగా ఈ తరహా లావా దేవీలు మళ్లీ పుంజుకుంటున్నట్టుగా తెలిపారు. నోట్ల రద్దు కారణంగా వ్యవస్థలోని పెద్ద కరెన్సీ నోట్ల చలామణి చాలా వరకు తగ్గిపోయిందని అన్నారు. దీనికి తోడు పన్ను చెల్లిం పుదారులతో పాటు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ల పరిధిని విస్తరించ గలుగుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.
తెలుగులోను అందుబాటులోకి తేజ్..
గూగుల్ సంస్థ ప్రభుత్వ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రోద్బలంతో తేజ్ యాప్ను రూపొందించింది. యూజర్ చార్జీలేమీ లేకుండానే చిన్న, పెద్ద చెల్లింపులను నేరుగా మన బ్యాంకు ఖాతాల నుంచి జరుపుకొనే వెసులుబాటు ఈ యాప్ ద్వారా కలుగనుంది. ఇంగ్లీష్తో పాటుగా భారత్లోని మొత్తం ఏడు ప్రధాన భాషల్లో (తెలుగులో కూడా) గూగుల్ దీనిని అందుబాటులో ఉంచింది. తేజ్ కోసం గూగుల్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లతో జట్టు కట్టింది. దీనికి తోడు యూపీఐ సదుపాయం ఉన్న దాదాపు 50 బ్యాంకుల ద్వారా చెలింపులు జరుపుకొనే సౌకర్యం కూడా ఈ యాప్ సొంతం.