Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జియోకు పోటీగా రూ.2000లకే..!
- సన్నాహాలు మొదలు పెట్టిన సంస్థ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చౌక ధరల ఫీచర్ ఫోన్ యుద్ధంలోకి దిగింది. జియోతో పాటు ఇతర టెల్కోలు తక్కువ ధరకే ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తనదైన శైలిలో పోటీకి సిద్ధమయ్యింది. ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో కేవలం రూ.2000లకే బీఎస్ఎన్ఎల్ ఈ ఫీచర్ ఫోన్ను తీసుకురానుంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు దీపావళి నాటికి చౌక ధరలో 4జీ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా ఇదే దిశగా కసరత్తు ప్రారంభించింది. తక్కువ ధరకే ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయంతో ఫీచర్ ఫోన్ను తీసుకురానున్నామని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇందుకోసం తాము లావా, మైక్రోమాక్స్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. రెండు మొబైల్ తయారీ కంపెనీల భాగస్వామ్యంతో అక్టోబర్లో దీపావళి నాటికి ఈ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ఉచిత వాయిస్ ప్యాకేజీల కంటే ఎక్కువ మొత్తంలో అందిస్తామన్నారు బీఎస్ఎన్ఎల్కు దేశ వ్యాప్తంగా దాదాపు 10.5కోట్ల మంది వినియోగ దారులున్నారు. ధరల పోటీకి తెరలేపిన జియో ఇప్ప టికే వినియోగదారుల నుంచి ముందస్తు ఆర్డర్లను తీసుకుంది. మరోవైపు భారతీఎయిర్టెల్ రూ.2500 కు స్మార్ట్ఫోన్ను అందించనున్నట్లు ప్రకటించింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా ఈ విభాగంలోకి ప్రవేశించడంతో పోటీ మరింత తీవ్రతరం కానుంది. అన్ని కంపెనీలు కూడా దీపావళికి ఈ చౌక ధరల ఫోన్లను అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకున్నా యి. టెల్కోల మధ్య నెలకొన్న ఈ పోటీ తీవ్రత వల్ల దీపావళి పండుగ కంటే ముందస్తుగానే ఫీచర్ ఫోన్ మార్కెట్ పూర్తిగా కుదుపులకు లోనుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో ఇప్పటికీ 57 శాతం మంది ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్నారని సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్) ఇటీవలే ఒక రిపోర్టులో వెల్లడిచ్చింది. ఇందులో 85 శాతం మంది కూడా స్మార్ట్ఫోన్లకు మారడానికి ఆసక్తి చూపడం లేదని మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్్(ఎంఎంఏ), కంతర్ ఐఎంఆర్బీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాల్లో వీటి వాడకం ఎక్కువగా ఉంది.