Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్టెల్ వచ్చే రెండేండ్లలో రూ.32,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొంది. తమ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి ఈ వ్యయం చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ వాటాలో మరో 3-4 శాతం పాయింట్లను పెంచుకోవాలని నిర్దేశించుకుంది. మార్కెట్లో ఇప్పటికే తీవ్ర పోటీని సృష్టించిన రిలయన్స్ జియోకు దీటుగా వివిధ టెల్కోలు కొత్త ప్రణాళికలు వేస్తున్నాయి. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్వర్క్ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధనం ఖర్చు చేయనున్నట్టు ఆ కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. వచ్చే రెండేండ్లలో కూడా అంతేమొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు పేర్కొన్నారు.