Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఃన్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ ట్రాక్టర్ల విభాగంలో కొత్త చరిత్రకు తెర తీసింది. మంగళవారం ఆ సంస్థ డ్రైవర్ రహిత ట్రాక్టర్ను ఆవిష్కరించింది. చెన్నై కేంద్రంగా ఉన్న సంస్థ రిసర్చ్ వ్యాలీలో ఈ కొత్త తరహా ట్రాక్టర్ను సంస్థ రూపొందించింది. డిజిసెన్స్ టెక్నాలజీతో సంస్థ ఈ కొత్త ట్రాక్టర్లను తయారు చేసింది. ముందస్తు ప్రోగ్రామింగ్తో పాటు రిమోట్తో ఈ ట్రాక్టర్ పని చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి 20 -100 హెచ్పీ సామర్థ్యంతో కూడిన అన్ని మోడళ్లలో డ్రైవర్ రహిత ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టుగా సంస్థ వెల్లడించింది. తమ కొత్త ఉత్పా దన భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పాదనను పెంచడంలో ఎంతగా నో దోహదం చేస్తుందని సంస్థ ఎండీ పవన్ గోయెంకా తెలిపారు. ఈ కొత్త తరహా ట్రాక్టర్లను అమెరికా, జపాన్తో పాటు పలు అంతర్జాతీయ మార్కె ట్లలో కూడా విడుదల చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఆటో స్టీరింగ్, ఆటో హెడ్ల్యాండ్ టర్న్ వంటి అత్యాధునిక టెక్నాలజీలతో రూపొందించారు.