Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.999కే దెబ్బతిన్న స్క్రీన్ రిప్లేస్మెంట్
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
శామ్సంగ్ సంస్థ స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా 'నెవర్ మైండ్' ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన 12 నెలల్లో తెర పగిలిపోయినా లేదా పాక్షికంగా దెబ్బతిన్నా కేవలం రూ.990లకే రిప్లేస్మెంట్ను ఇవ్వనున్నట్టుగా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహామ్మద్ ఆసిం వార్సీ తెలిపారు. ఇది వన్టైం రిప్లేస్మెంట్ ఆఫర్ అన్నారు. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని తాము ఈ ఆఫర్ను ప్రకటిస్తున్నామని ఇది కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తమ కంపెనీ ఉత్పత్తులకు విశేష డిమాండ్ లభిస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సామ్సంగ్కు 5700 మంది రిటైల్ నెట్వర్క్ భాగస్వాములున్నారన్నారు. అదే విధంగా 125 ఎక్స్క్లూజివ్ స్టోర్లు, 100 సర్వీసు కేంద్రాలతో విస్తరించి ఉన్నామన్నారు. 2017లో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ అమ్మకాలు 125 మిలియన్ యూనిట్లుగా ఉండొచ్చని చెప్పారు.