Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: ఫోర్బ్స్ ప్రకటించిన మేటి వ్యాపార చతురత కలిగిన సమకాలీన వ్యాపా రవేత్తల జాబితాలో మన దేశానికి చెందిన ముగ్గురికి స్థానం లభించింది. ఫోర్బ్స్ ప్రారంభించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా పత్రిక వెలువరించిన '100 గ్రేటెస్ట్ లివింగ్ బిజినెస్ మైండ్స్' పేరుతో జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ఆర్సెలర్ మిట్టల్ సీఏండీ లక్ష్మీ మిట్టల్, టాటా గ్రూప్స్కు గౌరవ చైర్మెన్ రతన్టాటా, సన్ మైక్రోసిస్టమ్స్ సహా-వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లాలకు స్థానం దక్కింది. ఇక ఈ ప్రత్యేక జాబితాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు స్థానం లభించింది. ట్రంప్ ఆర్గనైజేషన్కు 'సేల్స్మెన్ అండ్ రింగ్మాస్టార్'గా ఫోర్బ్స్పేర్కొన్నది. అమెజాన్ వ్యవస్థాపకులు జేఫ్ బెజోస్, బెర్క్షైర్ హాత్వే సీఈవో వారెన్ బఫెట్, మ్రైకోసాప్ట్ కో-పౌండర్ బిల్ గేట్స్ ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపార చరిత్రలో సంచలనాలు, పెట్టుబడులు ఎలా పెట్టాలి.., వ్యాపారుస్తుడి లక్ష్యం ఏలా ఉండాలి.., అనే అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 మంది వ్యాపారస్తుల ఆలోచనలను.. వారి వ్యక్తిగత, వ్యాపార విశేషలను తాజా సంచికలో ఫోర్బ్స్ పొందుపరిచింది.