Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఖాతాదారుల నడ్డి విరిచేలా మరో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల తమ బ్యాంకులో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన చెక్కులు ఈ నెలాఖరు తరువాత చెల్లబోవని ప్రకటించింది. దీంతో ఖాతాదారులు ఇప్పటికే నగదు చెల్లించిన చెక్బుక్లు చిత్తుకాగితాల్లా మారిపోనున్నాయి. దీనికి తోడు కొత్తగా చెక్బుక్లు పొందడం ఖాతాదారులకు మరో భారంగా మారనుంది. ఆయా బ్యాంకులకు చెందిన పాత చెక్బుక్లు, ఐఎఫ్ఎస్ కోడ్లు సెప్టెంబర్ 30 నుంచి చెల్లబోవని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్, ఎటిఎం ద్వారా కూడా కొత్త చెక్బుక్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతేడాది చివరిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్తో సహా ఆరు బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన సంగతి విదితమే.