Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటాసన్స్ను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మారేందుకు ఇన్వెస్టర్ల ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన టాటా సన్స్ వాటాదారుల సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులు ఈ అంశాన్ని సమీక్షించారు. ప్రయివేటు అంశానికి వాటాదారులు జె ౖకొట్టినట్టుగా సంస్థ తెలిపింది. తీర్మానాలకు మెజారీటీ వాటాదారులు ఆమోదం తెలిపారని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీిఎల్టీ) ఆమోదం లభించాల్సి ఉంది. అప్పుడే ప్రయివేటీకరణ ప్రక్రియ ముగిసినట్లవుతుంది. టాటా సన్స్ మాజీ చైర్మెన్ సైరస్ మిస్త్రీ వాటాలతో ఇబ్బందులు ఎదురవ్వొచ్చన్న అనుమానల నేపథ్యంలో టాటా సన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.