Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ విత్త సంస్థ యెస్ బ్యాంక్ వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్టుగా సమాచారం. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 2,500మంది సిబ్బందిని తొలగి స్తున్నట్టు సంస్త ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో ఇది 10శాతం కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఈ తొలగింపు ప్రక్రియ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని సంకేతాలు ఇచ్చింది. పేలవమైన పనితీరు, డిజిటలైజేషన్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో తొలగింపు చర్యకు దిగినట్టు పేర్కొంది. సంస్థలో ఉద్యోగుల తొలగింపు రెండో సారి. మరిన్ని ఉద్యోగాలు పోవచ్చని సమాచారం. ప్రస్తుతం బ్యాంకులో మొత్తం 20,851 వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సిబ్బంది పని తీరుని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, మెరుగైన ప్రదర్శన కనబర్చని వారిని ప్రతి ఏడాది గుర్తించడం సహజమేనని బ్యాంకు పేర్కొంది.