Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కంపాక్ట్ ఎస్యువీ విభాగంలో నెక్సాన్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను కంపెనీ రూ. 5.87లక్షల-రూ.6.87లక్షలుగా (ఎక్స్షోరూమ్, ముంబయి) నిర్ణయించింది. దీనిని పెట్రోల్, డీజిల్ వెరియంట్లలో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్ వెర్షన్లో 1.2 లీటర్ టర్బో ఛార్జడ్, 108 హెచ్పీ, 170 ఎన్ఎం సామర్థ్యపు ఇంజిన్తోనూ.. డీజిల్ వెర్షన్లో 1.5 లీటర్ ఇంజిన్, 108 హెచ్పీ, 260 ఎన్ఎం ఇంజిన్తోనూ సంస్థ దీనిని అందుబాటులోకి తెచ్చింది. డే నైట్ ఎల్ఈడీ, యాండ్రాయిడ్ ఆటో, ఆటో క్లైమెట్ కంట్రోల్, ఏబీపీఎస్, డ్యూయల్ ఎయిర్బ్యాగ్స్ ఫీచర్లతో కంపెనీ దీనిని మార్కెట్లోకి తెచ్చింది.