Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా 'సెల్ఫీ 3' స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. యాండ్రాయిడ్ నోగట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే ఈ ఫోన్లో 5 అంగుళాల తెర, ఫింగర్ ప్రింట్ సెన్సర్, క్వాల్కామ్ స్పాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, 16 ఎంపీ ముందు కెమేరా, 13 ఎంపీ వెనుక కెమేరాతో లభించనుంది. అలాగే 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 3జీబీ ర్యామ్తో పాటు 32 జీబీ అంతర్గాత మెమొరీ అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. దేశంలోని అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉందని తెలిపింది.