Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'రెనో' తన ప్రీమియం ఎస్యూవీ 'కాప్చర్'ను ఆవిష్కరించింది. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది. పండగ సీజన్కు అందుబాటులోకి తెచ్చేందుకు రూ.25,000 ప్రారంభ ధరతో బుకింగ్లను శుక్రవారం ప్రారంభించింది.గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో ఎండీ సుమిత్ సాహ్నీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మారుతుందని అన్నారు. ఎస్యూవీ సెగ్మెంట్లో రెనో కాప్చర్ తమ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుందని.. కొత్త బెంచ్మార్క్లను సృష్టించనుందని సుమిత్ తెలిపారు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రెక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), డ్యూయల్, సైడ్ ఎయిర్బ్యాగ్స్ లాంటి భద్రత ఫీచర్లను ఇందులో పొందుపర్చినట్టు తెలిపారు. పెట్రోల్, డీజిల్ రెండు వెరియంట్లలో రెనో కాప్చర్ను అందుబాటులోకి తీసుకోస్తున్నట్టు పేర్కొన్నారు.