Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బినామి ఆస్తుల వివరాలను వెలికి తీసేందుకు గాను సర్కారు వినూత్న పథకాన్ని యోచిస్తోంది. భారీగా నగదు నజరానాను ప్రకటించడం ద్వారా బడా బాబులకు చెందిన బినామి ఆస్తులకు సమాచారాన్ని గుప్తంగా సమీకరించాలని పత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) భావిస్తోంది. వచ్చే నెలలో ప్రవేశ పెట్టనున్న ఈ పథకం కింద బినామి ఆస్తులకు సంబంధించి సమాచారమై.. ఉప్పందించిన వారికి కనిష్టంగా రూ.15 లక్షల నుంచి గరిష్టంగా రూ. కోటి వరకు నజరానా అందించనున్నారు. ఈ విషయాన్ని సీబీడీటీ అధికారి ఒకరు తెలిపారు. అక్రమాస్తుల సమాచారాన్ని అందించిన వ్యక్తి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్టు సదరు అధికారి తెలిపారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బినామి ఆస్తుల చట్టంలో ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ లేదు. బినామి ఆస్తులను గుర్తించడం వాటిని పన్ను పరిధిలోకి తేవడం.. ఆదాయపు పన్ను శాఖ వర్గాలకు కఠినతరంగా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా సమాచారం.