Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఇప్పటి వరకు గృహ, వాహన, వస్తు కొనుగోళ్లకు మాత్రమే వాయిదా పద్దతి చెల్లింపు (ఇఎంఐ)లను చూశాం. కాని దుబారుకు చెందిన విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్వేస్ విమానయానంలోనూ ఈ తరహా సదుపాయాన్ని తొలిసారి అందుబాటులోకి తెచ్చింది. 'ప్లై నౌ అండ్ పే లేటర్' (ఇప్పుడు విమానం ఎక్కండి, తర్వాత చెల్లించండి) స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద నెలవారీ వాయిదాల్లో టిక్కెట్ ఛార్జీలను చెల్లించుకునే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా కుటుంబ సభ్యులు తమ విమాన టిక్కెట్లను వారి సౌలభ్యం మేరకు బుక్ చేసుకోవచ్చని, అవసరాలకు అనుగుణంగా చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవచ్చని ఆ విమానయాన సంస్థ తెలిపింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 3 నుంచి 60నెలల వాయిదాలతో ఈ డబ్బు చెల్లించవచ్చు. విమాన ప్రయాణం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది భారమేనని ఎతిహద్ ఎయిర్లైన్స్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బీ పేర్కొన్నారు. దిగువ, మధ్య తరగతి కుటుంబాలను దష్టిలో పెట్టుకుని దీనికి రూపకల్పన చేశామన్నారు.